ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేది.22-02-2025
అక్రమంగా గంజాయి తరలించు నింధితుడిని అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు
నిందితుడి వద్ద నుండి సుమారు 04 లక్షల రూపాయల విలువైన 78 కేజీల గంజాయి స్వాదీనం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. హరీష్ గుప్తా ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏ డి సి పి శ్రీ ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియాలో వాహన తనిఖీ చేస్తూ అనుమానిత అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం ను అదుపులోనికి తీసుకుని అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం డ్రైవరు అయిన మహారాష్ట్ర ఒసామాబాద్ ఏరియాకి చెందిన శేషా రావు మానే (39 సం.) ను విచారించి అతని వద్ద నుండి 78 కేజీల గంజాయిని, అశోక్ లైలాండ్ దోస్త్ వాహనంను స్వాదీనం చేసుకుని గుణదల పోలీసు స్టేషన్ నందు క్రైమ్.నెం 24/2025 NDPS Act గా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది.
మహారాష్ట్రకు చెందిన శేషా రావు మానే అనే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందిన సచిన్ కడ్మ్ అనే కాంట్రాక్టర్ దగ్గర గత కొంతకాలంగా డ్రైవరు గా పనిచేస్తున్నట్లు, ఈ క్రమంలో తన యజమాని అయిన సచిన్ నువ్వు విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుండి గంజాయిని కర్నాటక తీసుకువెళ్లి అందిస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఎక్కువ డబ్బులకు ఆశపడి వెంటనే సరే అనుకుని అక్కడ నుండి ట్రైన్ ద్వారా విశాఖపట్నం వెళ్ళి అక్కడ సచిన్ చెప్పిన వ్యక్తి అయిన అనకాపల్లి కి చెందిన శంకర రావు మరియు నర్సీపట్నం కు చెందిన రవి కుమార్ అనే వారితో మాట్లాడగా ఆయిల్ టాంక్ లలో గంజాయి ఎవ్వరికీ కనపడకుండా ఉండేవిధంగా లోపల ఒక అర లాగా తయారు చేసి దానిలో పెట్టి మిగిలిన సగ బాగంలో ఆయిల్ తో నింపిన టాంక్ లను కర్నాటకా తీసుకువెళ్లిన తరువాత అడ్డ్రస్ చెపుతాము అక్కడ చెప్పిన అడ్డ్రస్ లో డెలివరీ ఇవ్వాలి అని చెప్పగా సరేనని అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం తీసుకుని దానిలో ముందుగా ఏర్పాటు చేయబడిన నాలుగు ఆయిల్ టాంక్ లను ఒక ట్రక్ అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం లో ఎక్కించుకుని విశాఖపట్నంనుండి హైదరాబాదు వైపు నుండి కర్ణాటకా వెళ్లడానికి విజయవాడ మీదుగావెలుతున్న సమయంలో టాస్క్ ఫోర్స్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో వాహన తనిఖీ చేస్తున్న సమయంలో అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం ను అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి సుమారు 78 కె.జి.ల గంజాయి వాటిని తరలించడానికి ఉపయోగించిన అశోక్ లైలాండ్ దోస్త్ వాహనం ను మరియు ఖాళీ ఆయిల్ టాంక్ లను స్వాదీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎవ్వరూ గుర్తించలేని విధంగా ఆయిల్ టాంక్ లలో ప్రత్యేక అరాలను ఏర్పాటు చేసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ కుమార్ ని, నాగ శ్రీనివాస్ ని, గుణదల ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు ని మరియు వారి సిబ్బందిని అధికారులు అభినందించారు.
ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును. నెంబర్: 9121162475
Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in