అంబేద్కర్ పేరుతో వైసిపి రాజకీయం చేస్తుంది
జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్
వైసిపి ఐదేళ్ల పాలనలో దళితులపై అక్రమ కేసులు పెట్టి దాడులు, దౌర్జన్యాలకు, తెగబడ్డారని, ఇప్పుడు అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసిపి ప్రయత్నం చేస్తుందని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం 43వ డివిజన్లో విలేకరుల సమావేశం లో బాడిత శంకర్ మాట్లాడుతూ, వైసిపి ఐదేళ్ల పాలనలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వారి గొంతు నొక్కారన్నారు. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం లో వైఎస్ జగన్ పేరుని గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తే కూటమి ప్రభుత్వం చేసిందనటం సిగ్గుచేటు అన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే రక్షించింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని,దళితుల పై శిరోముండనం కేసులో శిక్ష పడిన వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జగనేనని అన్నారు. కరోనా సమయంలో మాస్కులు ఇవ్వలేదని ఆరోపణలు చేసిన దళితుడైన డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి పిచ్చివాడని ముద్ర వేసి ఆయన చావుకి కారణమైంది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆకాశమే హద్దుగా అవినీతి సంపద దోచుకున్న నాయకులందరూ వైసీపీలోనే ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ , మైనింగ్ మాఫియా ,చేసి వేల కోట్లు సంపాదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైసిపి వాడేనని , లిక్కర్ మాఫియా అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన వాసుదేవరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు అన్నారు. అక్రమ వసూళ్లు చేసి తిరుమలలో శ్రీవారి సంపదను దోచుకున్న ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి అప్పగించడానికి ప్రయత్నం చేశారని వైసిపి నేత పోతిన మహేష్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోతిన మహేష్ విమర్శలు పట్టించుకోమని అమూల్ బేబీ పొతిన , తన ఉనికిని కాపాడుకోవడం కోసం సుజనా చౌదరి లాంటి గొప్ప వ్యక్తుల మీద బురద జల్లుతున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమిగా జతకట్టి జగన్ ఆర్థిక విధ్వంసాలకు పుల్ స్టాప్ పెట్టామని అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొనసాగిస్తున్నారని, అంబేద్కర్ పేరు చెప్పి వైసిపి ,రాజకీయాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.