అంత్యోదయ బడ్జెట్ గోపీశ్రీనివాస్
కేంద్ర బడ్జెట్ 2025 అన్ని వర్గాల అభివృద్ధికి చెందిన
సమతుల్య బడ్జెట్ అని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీశ్రీనివాస్ అన్నారు.
స్వర్గీయ గురజాడ అప్పారావు సూక్తి “దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్” అని ప్రశంగం ప్రారంభించిన ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ సబ్ కా వికాస్ తో వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. పేదరికం లేని సమాజం అందరికి విద్య వైద్యం ఉపాధి కలిపిస్తూ ప్రపంచానికి అన్నపూర్ణగా భారత్ ని నిలిపే బడ్జెట్ ఇది. నిర్మలమ్మ 8వ బడ్జెట్ 2014 ముందు అస్తవ్యస్తంగా ఉన్న భారత్ ఆర్ధిక స్థితి నుండి ఈ రోజు ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా నిలిచే దిశగా పయనిస్తుంది. చారిత్రాత్మకంగా వ్యవసాయం, వస్తు ఉత్పత్తి, తయారీ రంగం, భారీ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు,MSME అభివృద్ధి ద్వారా ఎగుమతులలో చరిత్ర సృష్టించే దానిలో గ్రామీణ పట్టణ ప్రజలు మహిళలు యువత ఎస్సీ ఎస్టీ బిసి సమాజం భాగస్వామ్యం అవ్వనున్నారు. పెద్ద ఎత్తున వృత్తి వ్యాపార ఉద్యోగ కల్పన జరగనున్నది. వ్యవసాయం, MSME పెట్టుబడులు ఎగుమతులు ప్రధాన ఇంజన్లు గా సంస్కరణలు చేస్తూ వికసిత్ భారత్ గమ్యాన్ని ఈ బడ్జెట్ నెరవేరుస్తుంది. విద్యుత్, గనులు, పన్నులలో సంస్కరణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో 12 లక్షలు సంపాదిస్తే పన్నుగా 2 లక్షలు ప్రజలు చెల్లించేవారు కానీ ఆ పన్ను మినహాయింపు ఇచ్చారు. టాయ్ హబ్ పరిశ్రమల హబ్ పర్యాటక హబ్ లు గా భారత్ ఉండనున్నది. వైద్య రంగంలో కీలక నిర్ణయాల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించనున్నారు. అందరికి త్రాగునీరు కోసం జలజీవన్ మిషన్ కొనసాగింపు మహిళలకు ఆర్ధిక స్వావలంభన రాష్ట్రాలకు 50 యేండ్లు వడ్డీ లేని రుణాలు వుడాన్ పధకం విస్తరించి 4 కోట్ల మందికి విమాన ప్రయాణం సౌకర్యం ఫండ్ అఫ్ ఫండ్ తో స్టార్టప్ లకు చేయూత కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు పిఎం ధాన్య యోజన తో 1.7 కోట్ల మంది రైతులకు 100 జిల్లాల్లో పధకం ఎఐ తో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచంలో భారత్ ఏఐ అభివృద్ధి కేంద్రంగా మార్చనున్నారు. రక్షణ, రవాణా, పట్టణాభివృద్ధి, ఐటీ టెలీకామ్ భీమా రంగాలలో గొప్ప కేటాయింపులు జరిగాయి. సంక్షేమం అర్హులకు అందేవిధంగా గొప్ప మార్గాన్ని చూపారు. అందరికి నివాసం,వైద్యం, విద్య,ఆదాయం, ఆర్ధిక వృద్ధి,సమానత్వం ఆలోచనతో అంత్యోదయ లక్ష్యంగా ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా దేశాన్ని నిలిపేవిధంగా సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతర ప్రధాన్యతతో గొప్ప బడ్జెట్ ని దేశానికి అందించిన ఆర్ధిక మంత్రివర్యులు నిర్మల సీతారామన్ కి ధన్యవాదములు తెలిపారు.