*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ 26-06-2024
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్దాలపై అవగాహనా సదస్సునిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు.
ది.26.06.2024 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరియు ఆంధ్రరాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. ద్వారకా తిరుమల రావు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు”మాదక ద్రవ్యాలకు దూరంగా వుండండి జీవితాన్ని కాపాడుకోండి” అనే నినాదంతో డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర డి.జి.పి. ద్వారకా తిరుమల రావు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లితండ్రులు అందరూ కలిసి ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆటకట్టించడానికి ఎల్లవేళల సిద్ధంగా ఉన్నామని డ్రగ్ మాఫియాను అరికట్టడానికి ప్రజలు, విద్యార్థులు కలిసి పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు. అనంతరం మీ తల్లి దండ్రులు ఆకాంక్షలకు అనుగుణం గా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించ్చారు. 35 సంవత్సరాల క్రితం ఫ్యాషన్ కోసం కొంతమంది డ్రగ్స్ స్టార్ట్ చేశారని, ప్రస్తుతం స్కూల్ ఏజ్ పిల్లలు కూడా ఈ వ్యసనాలకు బానిసలు అవుతున్నారని, సామాన్యులే కాదు, స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ కెరీర్ నాశనం అవుతుందని, డ్రగ్స్ కేసుల్లో సంవత్సరాలపాటు శిక్షలు ఉంటాయని, దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, డ్రగ్ మాఫియా కొన్ని దేశాలను శాశిస్తున్నాయని, డ్రగ్స్ పరిమితి పెరిగితే అంతర్జాతీయంగా ఆ దేశంపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలియజేశారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుందని, సదరు యాక్షన్ ప్లాన్ పై నిక్కచ్చిగా వ్యవహరించడం జరుగుతుందని, ఎటువంటి సమస్యలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొని డ్రగ్స్ సమస్య లేకుండా చేయడం జరుగుతుందని, గంజాయి సాగు, రవాణా చేయడం పై పూర్తి నిఘా ఏర్పాటు చేసి గంజాయి సాగు, రవాణాను కట్టడి చేస్తున్నాం, అదేవిధంగా గంజాయి సాగు చేస్తున్న వారికి అవగాహన కల్పించి వారికి ప్రత్యమ్నాయంగా ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందని తెలియజేశారు, పక్క దేశాలకు పారిపోయిన నేరస్తులను తెచ్చిన చరిత్ర ఏపీ పోలీసులకు ఉందని, అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల సహకారంతో గంజాయిని అణచి వేయడం జరుగుతుందని, అవరోధాలు అధిగమించి మేము అనుకున్నది సాధిస్తాము అని తెలిపారు.
ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ నందు తూర్పుగోదావరి, విశాఖపట్నం (ASSR) జిల్లాల నందు గంజాయి సాగు జరుగుతున్నది. ఇవి ఎత్తైన కొండలు, అడవులతో నిండి ఉన్న ఆదివాసి ప్రాంతం కావడం మరియు బౌగోళికంగా ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉండటం మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చట కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యాచరణలో బాగంగా ఈ ప్రాంతాలలో గంజాయికి బదులు ఇతర ఉపయుక్త పంటలను పండింప చేయడం, గంజాయి సాగు చేస్తున్న వారికి పునరావాసం కల్పించడం, సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవటం తనిఖీలలో బాగంగా ముఖ్యమైన ప్రాంతాలలో సమీకృత చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం, శిక్షణ పొందిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది.
జిల్లా కలెక్టర్, ఎస్.పి. ఐ.టి.డి.ఏ., డి.ఎం. &హెచ్.ఓ. మరియు ఇతర సఖాల, సమన్వయంతో ప్రతి జిల్లా నందు నార్కో కో ఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం, ఎఫ్.ఎస్.ఎల్. మరియు ఆర్.ఎఫ్.ఎస్.ఎల్. యొక్క సామర్ధ్యం పెంచేందుకు మరిన్ని ప్రయోగశాలలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దర్యాప్తు అధికారులు, పోలీస్ అధికారుల సామర్ధ్యాన్ని పెంచేందుకు మరిన్ని పి.టి.సి.లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబందిచి మరియు ఇతర సమాచారం ఇచ్చుటకు ఎస్.ఈ.బి. టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీనిమీద కూడా సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించుటకు సవత్సరం పొడుగునా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ గాంజా డిమాండ్ ను తగ్గించే దాంతో బాగంగా డిఅడిక్షన్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.విచ్చలవిడి తనానికి అలవాడు పడి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్క దిద్దికోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారని, మత్తు వదలకపోతే బ్రతుకులు నాశనం అవుతాయని, నిషేధిత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారు ఒక సంవత్సరం కాలంలో సుమారు 220 కేసులు నమోదు చేసి 900 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగిందని, డ్రగ్స్, గంజాయి మరియు తదితర మాదకద్రవ్యాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్లాన్ రెడీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా పోలీస్ కమీషనరేట్ పరిదిలో ఇంటిలిజెన్స్, టాస్క్ఫోర్స్, ఎక్షైజ్, లా & ఆర్డర్ అన్ని శాఖల సమన్వయంతో ఒక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని కోట్లు గడిద్దామని ఎవరైనా భ్రమ పడి అమాయక యువకులు, విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా వారికి ఒక సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని మరియు బెయిల్ కూడా రాదని తెలియజేశారు. విద్యార్ధులు డ్రగ్స్ వినియోగిస్తూ లేదా తరలిస్తూ పట్టుబడిన వారికి కూడా ఒక సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని, అంతేకాకుండా పై చదువులకు ఇతర దేశాలకు వెళ్ళడానికి, ఉద్యోగాలు పొందడానికి అనర్హులుగా ఉంటారని తెలియజేశారు. ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో పలుమార్లు విక్రయిస్తూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై పి.డి.యాక్ట్, ఎనిమిది మందిని నగర బహిష్కరణ చేయడం జరిగిందని తెలిపినారు. మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, క్షణకాలం సంతోషం కోసం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దన్నారు.
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల అనుమతి లేకుండా మన శరీరంలోకి డ్రగ్స్ వెళ్ళకూడదని, టెన్షన్ వచ్చినప్పుడు, నిద్ర కోసం, ఎంజాయ్ చేయడం కోసం, నేరాలు చేసేముందు ఇలా రకరకాల కారణాలతో డ్రగ్స్ తీసుకుంటున్నారని, డ్రగ్స్ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రస్తుతం డ్రగ్స్ తీసుకునే రేంజ్ కాలేజ్ నుండి స్కూల్ లెవెల్ కి చేరుతోందని, ఇది చాలా ప్రమాదకరం అని తెలియజేశారు. ప్రపంచ మానవాళి పురోభిరవృద్దికి పెనుభూతమైన గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యమునకు కలిగే నష్టాలను గురించి, భవిష్యత్ లో ఏ విధంగా వారి జీవితాలు పాడవుతయనే అంశంపై విద్యార్ధులుకు అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ ప్రభావం వలన తల్లి తండ్రులు కష్టపడి చదివించి గొప్ప వాళ్ళను చేయాలనుకొన్న ఆశలు అడియాశలు అవుతాయని మరియు వాటి భారిన పడితే భవిష్యత్ ఏవిధంగా అంధకారం అవుతుందో అవగాహన కలిగించినారు. విద్యార్థులకు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలో సూచనలు ఇచ్చారు.
అడిషనల్ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వర రావు మాట్లాడుతూ… విద్యార్ధినీ విద్యార్ధులకు మాదక ద్రవ్యాల వ్యసనం వలన కలిగే చెడు ప్రభావాలు గురించి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించిన, కలిగి ఉన్నా, విక్రయించిన మరియు సేవించినా వారికి విధించు శిక్షల గురించి విపులంగా వివరించడం జరిగింది. విద్యార్ధులు డ్రగ్స్ వినియోగిస్తూ లేదా తరలిస్తూ పట్టుబడిన జైలు శిక్షలు పడతాయని, పై చదువులకు ఇతర దేశాలకు వెళ్ళడానికి, ఉద్యోగాలు పొందడానికి అనర్హులుగా ఉంటారని తెలియజేశారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, సరఫరా చేయడం మరియు వినియోగించడం చట్టపరంగా నేరమని, వాటికి కఠినమైన శిక్షలు ఉన్నాయని అవగాహన కల్పించడం జరిగింది.
అనంతరం డి.సి.పి. కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్. కార్యక్రమానికి వచ్చిన అందరితో..ఏ దేశానికైనా యువతే శక్తి.సమాజం మరియు దేశాభివృద్ధిలో యువశక్తి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువలన, మాదకద్రవ్యాలరహితభారత దేశం ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గోనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ, ఈ రోజు మనం నషా ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యంగా ఉండి, సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా, మనం కూడా మాదకద్రవ్యాలరహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ని మాదకద్రవ్యాలరహితజిల్లాగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని” ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్. అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్. ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్. టి.హరికృష్ణ కె.చక్రవర్తిగారు, ఏ.డి.సి.పి. కృష్ణ మూర్తి నాయుడు టి.కనకరాజు ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మరియు సుమారు 1000 మంది కళాశాల విద్యార్ధిని విద్యార్ధులు, పేరెంట్స్, ఫ్యాకల్టిస్, ఎన్.జి.ఓ.లు, డాక్టర్స్, అడ్వకేట్స్ మరియు ఇతర సొసైటీ ఎల్డర్స్ పాల్గొనారు.