ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ. 07-03-2025
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎన్. టి. ఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ ఆద్వర్యంలో ఈ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు Breaking the Glass Ceiling Women in Leadership ,Challenges and Wayforward (అదృశ్య అవరోధాలను ఛేదించడం- మహిళల నాయకత్వం సవాళ్లు మరియు పురోగమించే మార్గం) అనే అంశంపై ఘనంగా రాష్ట్రస్థాయి ప్యానెల్ డిస్కషన్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోం శాఖా మాత్యులు వి. అనిత , రాష్ట్రమంత్రి వర్యులు ఎస్. సవిత నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ , ANU కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ , వాసవ్య మహిళా మండలి డా. చెన్నూపాటి కీర్తి , ప్రముఖ గైనకాలజస్ట్ డా. ఆవిరినేని శశి బాల , ఐద్వా స్టేట్ సెక్రటరీ శ్రీమతి డి. రమాదేవి , అవేరా కో ఫౌండర్ శ్రీమతి చాందిని చందన , ఏఫ్ట్రానిక్స్ డైరెక్టర్ స్ఫూర్తి , ఈస్ట్ డి. సి. పి. గౌతమీ షాలి ఐ.పి.ఎస్., అడ్మిన్ డి. సి. పి. కె. జి. వి. సరిత ఐ. పి. ఎస్. డి. సి. పి. ఎ. బి. టి. ఎస్. ఉదయారాణి ఐ. పి. ఎస్. , షరీనా బేగం ఐ. పి. ఎస్. , ట్రైనీ ఐ. పి. ఎస్. మనీషా , యాంకర్ గాయత్రి భార్గవి పాల్గొని పైన తెలిపిన అంశంపై మహిళలు నాయకత్వ స్థాయికి ఎదగడంలో ఎదుర్కొనే సవాళ్లు, అవరోధాలు మరియు వివక్షలను అధిగమించే మార్గాల గురించి కూలంకుషంగా చర్చించడం జరిగింది.
ఈ ప్యానల్ చర్చ మహిళల నాయకత్వ సామర్థ్యాలను వెలికి తీయడం, వారి ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలను అన్వేషించడం మరియు సమాజంలో వారి విజయాలను గౌరవించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.
ఈ సందర్బంగా హోంశాఖా మాత్యులు వి అనిత మాట్లాడుతూ.ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవం శుాకాంక్షలు తెలియజేశారు, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. ని ప్రత్యేకంగా అభినందించారు. మహిళను విమర్శించటంలో ముందు క్యారెక్తర్ పై దుషిస్తారు, కూలీ చేసుకునే వారి నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ గొప్పగానే చెప్పాలి, నేను ఇక్కడ కూర్చోవడానికి మా పాయకరావు పేట నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు, మా నాన్న ఇన్స్పిరేషన్, తరువాత నేను చనిపోయే వరకు నా ప్రత్యేక దైవం చంద్రబాబు ,అనేక అవమానాలు, ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాము, మాకు రిజర్వేషన్లు అక్కరలేదు..
మేము అనుకుంటే ఎక్కడి వరకు అయిన వెళ్తాం, నేను కూడా ఎక్కడి వెళ్ళిన మగపిల్ల లా ముందుకు వెళ్తున్నాను అంటారు. ఈ భేదం మనకి తల్లి దగ్గరి నుంచీ వస్తుంది ..మగ వారిని, ఆడవారిని కొంచం లింగ భేదంగా పెంచుతుంటారు. ఎప్పుడు అయ్యితే తల్లి నువ్వు మగ పిల్లల వాడివి జాగ్రత్త అని చెప్పే రోజు రావాలి అని తెలియజేశారు.
బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్. సవిత మాట్లాడుతూ మా నాన్న నాకు ఇన్స్పిరేషన్, మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబం, ఎన్టీఆర్ ని చూస్తూ పెరిగాను,రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, అనేక కేసులు , అవమానాలు పడుతూ ముందుకు ఈ స్థాయికి వచ్చాను. ఈ సందర్బంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. ని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళా కి శుభాకంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్యానల్ చర్చా కార్యక్రమానికి వచ్చిన అతిధులకు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. మెమంటోలతో చిరు సత్కారం చేసారు